కోలాటం గురువు త్రిమూర్తికి సన్మానం
NEWS Mar 28,2025 10:25 pm
బుచ్చియ్యపేట మండలం కేపీ అగ్రహారం గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ సందర్భంగా కోలాటం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వడ్డాది శ్రీ పద్మలంగేశ్వర కోలాటం గ్రూపు పాల్గొని 5వ స్థానం సాధించింది. ఈ ప్రతిభ కనబరిచిన కోలాటం గ్రూప్ కి, కోలాటం గురువు నేతల త్రిమూర్తికి కె.పి అగ్రహారం శ్రీ నూకాంబిక అమ్మవారి కమిటీ సభ్యులందరూ జ్ఞాపిక నగదు, శాలువాతో సన్మానించారు.