రాష్ట్రంలో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణకు తనకు చోటు కల్పించాలని కోరారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. శుక్రవారం ఆయన ఢిల్లీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు. ఈ సందర్బంగా వినతి పత్రం ఇచ్చారు. తనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందని, అందుకే కేబినెట్ లో చోటు కల్పించాలని విన్నవించారు. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరారు దొంతి మాధవరెడ్డి.