తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన సంఘాల నేతలు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ మేరకు నేతలు వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించారని, తమకు ఛాన్స్ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా అత్యధిక జనాభా కలిగిన గిరిజన సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు లేక పోవడం దారుణమన్నారు.