ప్రధాని మోదీపై భగ్గుమన్న విజయ్
NEWS Mar 28,2025 03:42 pm
తమిళ సినీ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తమిళనాడును తేలికగా తీసుకోవద్దంటూ హెచ్చరించాడు. చాలా రాష్ట్రాలకు చుక్కలు చూపించిన చరిత్ర తమదన్నారు. డీ లిమిటేషన్ పేరుతో కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచనతో తమిళనాడుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.