వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి
NEWS Mar 28,2025 02:40 pm
ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శుక్రవారం నమాజ్ అనంతరం మెట్టుపల్లి లో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు ముస్లిం సోదరులు . ఇట్టి కార్యక్రమంలో మాజీ మర్కజ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ కుతుబ్ పాషా ,మైనారిటీ మండల అధ్యక్షులు మహమ్మద్ యాసీన్ , అబ్దుల్ ఇమ్రాన్ , మహమ్మద్ అఫ్రోజ్ , తదితరులు పాల్గొన్నారు.