మయన్మార్ లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా బ్యాంకాక్, థాయిలాండ్ అంతటా గణనీయమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది, దీని కేంద్రం మయన్మార్లోని మోనివాకు తూర్పున దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.