ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామివారిని కొత్తపేట ఆర్డీఓ శ్రీకరణ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వారికి వేద ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు స్వామివారి చిత్రపటాలను, తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.