NRPT: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్ స్టెప్ ఫౌండేషన్ రాష్ట్ర అధికారులు శరణ్, ఆకాశ్ అన్నారు. నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ తరగతులను పరిశీలించారు .శిక్షణలో నేర్చుకున్న విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.