NRPT: మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. గడువులోపు నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. రూ. 5 కోట్ల వ్యయంతో భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.