వీరహనుమాన్ విజయయాత్ర కరపత్రం ఆవిష్కరణ
NEWS Mar 28,2025 12:21 am
బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ మెట్ పల్లి శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న నిర్వహించనున్న వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రాన్ని కాశీ బాగ్ హనుమాన్ ఆలయంలో ఆవిష్కరించారు. వీర హనుమాన్ విజయ యాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు తుకారం, భాస్కర్, సత్యనారాయణ, రాజశేఖర్, ముక్క నరేష్, ఉత్తేజ్, నరసయ్య, లక్ష్మణ్, శ్రీకాంత్ తదితరులున్నారు.