గండి హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు
NEWS Mar 28,2025 12:20 am
మెట్ పల్లి గండి హనుమాన్ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం ₹ 2,61,220 వచ్చాయని ఆలయ చైర్మన్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ రాజమౌళి, గండి హనుమాన్ చైర్మన్ ఏనుగు రామానుజన్ రెడ్డి, కార్య నిర్వహణ అధికారి విక్రమ్ గౌడ్, ఆలయ ధర్మకర్తలు కూకట్ల వేణుగోపాల్, మనోజ్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు చక్రపాణి మాధవాచార్యులు, ఆలయ సిబ్బంది రెండ్ల గంగాధర్, భక్తులు పాల్గొన్నారు.