కొండగట్టు దిగువ ప్రాంతంలోని బస్టాండ్ చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపుల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. ఈ చౌరస్తాలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకే ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు.