వేంకటేశ్వర స్వామి ఆలయం జాతరకు ముస్తాబు
NEWS Mar 27,2025 06:22 pm
ఇబ్రహీంపట్నం మండలం లో వర్షకొండ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం జాతర సందర్బంగా ముస్తాబవుతోంది. ఈ సందర్బంగా ఆలయంలో, బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు , సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. నిరంతరం నీళ్లు, లైటింగ్, రథం గుడి చుట్టూ తిరిగేందుకు ఏర్పాటు చేశారు.