స్పీకర్ సూచనపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
NEWS Mar 27,2025 02:14 pm
మెట్పల్లి: కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వానికి సూచించడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరంచంద్ గతంలోనే కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కరంచంద్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. రైసొద్దీన్, తైసీన్, అడ్వకేట్ రాంబాబు, కృష్ణ, కాజా అజీమ్, పెంట ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.