తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Mar 27,2025 09:44 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 75 వేల 354 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 510 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. భక్తుల క్యూ లైన్ ఏటీసీ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.