ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో స్వంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. టోర్నీలో బోణీ కొట్టింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఘోరంగా ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశ పరిచింది. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్న ఈ జట్టు ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ ఊహించ లేదు. అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక పద్దతి అంటూ లేకుండా ఆడటం విస్తు పోయేలా చేసింది.