ఆ 400 ఎకరాలు హెచ్ సీయువి కావు
NEWS Mar 26,2025 05:06 pm
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినవి కావన్నారు. 25 సంవత్సరాల క్రితం బిల్లీ రావు అనే వ్యక్తికి ఆ భూమి కేటాయించారని చెప్పారు. అక్కడ జింకలు, పులులు, సింహాలు లేవన్నారు. వాటి చుట్టూ కొన్ని గుంటనక్కలు చేరి ఇట్ల వ్యవహరిస్తున్నాయని అన్నారు. గుంట నక్కలకు గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. 2014 నుంచి 2024 వరకూ ప్రభుత్వం ఆ భూమిని గుంజు కోలేదన్నారు. తాను వచ్చాక సుప్రీంకు వెళ్లి కొట్లాడనని చెప్పారు. భూమి వెనక్కి తీసుకొని అభివృద్ధి చేద్దామనుకున్నామని అన్నారు.