ఐ అండ్ పీఆర్ లో వేల కోట్లు కాజేశారు
NEWS Mar 26,2025 04:57 pm
అసెంబ్లీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఐ అండ్ పీఆర్ శాఖలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో వేల కోట్లు కాజేశారంటూ మండిపడ్డారు. సొంత ఆస్తిలా, వాళ్ల జేబులో డబ్బులాగా వాడుకున్నారని అన్నారు. సర్పంచ్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీలకు అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్లను నియమిస్తున్నామని ప్రకటించారు. జీవో ద్వారాా 23 వేల మంది వీఆర్వో, వీఆర్ఏలను రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.