మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఆయన మాటలను రికార్డ్స్ నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. మీలా బరితెగించి తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అడ్డంగా దోచుకున్నది చాలక తమపై నిందలు వేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. కేటీఆర్ ను ఉద్దేశించి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు.