కేబినెట్ లో మాదిగలకు ఛాన్స్ ఇవ్వాలి
NEWS Mar 26,2025 03:41 pm
రాష్ట్రానికి చెందిన దళిత ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుదీర్ఘ లేఖ రాశారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులకు చోటు కల్పించాలని కోరారు . మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య లేఖ అందజేశారు.