తెలంగాణ సర్కార్ తో సీస్కో ఒప్పందం
NEWS Mar 26,2025 03:30 pm
ప్రముఖ ఐటీ కంపెనీ సిస్కో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ది పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు , డిజిటల్ రంగంలో సహకారం అందించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్కిల్ యూనివర్శిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు గాను ఎంఓయూ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.