రైల్వే స్టేషన్ కు వీల్ చైర్ అందజేత
NEWS Mar 26,2025 06:46 pm
ప్రయాణికుల సౌకర్యార్థం వీల్ చైర్ ను కామారెడ్డి రోటరీ క్లబ్ ప్రతినిధులు రైల్వే అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాజనర్సింహారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి రైల్వేస్టేషన్లోని వృద్ధ వికలాంగ ప్రయాణికుల సౌకర్యార్థం దాత సుభాష్ చంద్ జైన్ సుమారు రూ.10 వేల విలువైన గల వీల్ చైరు ఉచితం గా అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం లో రొటీరియన్స్ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ జైపాల్ రెడ్డి , ధనుంజయ్ శ్రీశైలం , డా.బాలరాజు సుధాకర్ రావు, నాగభూషణం చంద్రశేఖర్ ,కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.