నవోదయలో సీటు సాధించిన శశాంక్
NEWS Mar 26,2025 05:15 am
విద్యార్థి శంబోజీ శశాంక్ నవోదయ గురుకుల విద్యాలయం చొప్పదండిలో సీటు సాధించాడని తెలిపారు స్కూల్ ప్రిన్సిపాల్ కిషన్. మాజీ సర్పంచ్ కంటే నీరజ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గసికంటి లతా వేణులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలని, సెల్ ఫోన్లకు బందీలు కావద్దని అన్నారు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి , పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు.