విశ్వ విద్యాలయాల నిబంధనలు మార్చాలి
NEWS Mar 26,2025 09:54 am
అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీల్లో విధి విధానాలు ఒకేలా ఎందుకు ఉండవు అంటూ ప్రశ్నించారు. సిలబస్, కరికులమ్, మార్కులు, ప్రమోషన్లు ఎందుకు ఒకేలా ఉండకూడదు? రూల్స్ మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరు మార్చాలని కోరారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ ఎక్కడుందంటూ నిలదీశారు.