తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది నిరుద్యోగులకు. ఈ మేరకు ఇటీవలే ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్థిక సాయం అందించేందుకు గాను మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఈ పథకం కింద లబ్ది పొందేందుకు అర్హులని పేర్కొంది సర్కార్. యువతకు 50 వేల నుంచి 4 లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.