మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కిట్లపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్పై జోకులు వేసి పైశాచికానందం పొందారని మండిపడ్డారు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో జగన్ను అవహేళన చేయడం దారుణమన్నారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. అవమానించడం సాంప్రదాయం కాదన్నారు. ఈ అంశాన్ని చట్టసభల్లోనే ప్రస్తావిద్దాం అని అనుకున్నానని అన్నారు మాజీ మంత్రి.