తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే
NEWS Mar 26,2025 09:26 am
అసెంబ్లీ సాక్షిగా మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ ఏనాడూ కించ పర్చ లేదన్నారు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమం చేశారని పేర్కొన్నారు. 1969లో 360 మంది చనిపోయినా తెలంగాణ రాలేదన్నారు. బీజేపీ పాలనలో 3 రాష్ట్రాలు ఇచ్చారని, కానీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. రాజకీయంగా దెబ్బ తిన్నప్పటికీ , ఆ విషయం తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని, ఆమె లేకుంటే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు జూపల్లి .