నేడు జిల్లా కేంద్రంలో జాబ్ మేళా
NEWS Mar 26,2025 09:04 am
MBNR: జిల్లా కేంద్రంలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగ మేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై 30 ఏళ్లలోపు యువకులు అర్హులని పేర్కొన్నారు.