తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఫీజు చెల్లింపు గడువును మరో నెల రోజులు పొడిగించాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎరుకల రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించ బడిన ప్లాట్లలో గృహ నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు.