అసెంబ్లీలో బట్టలు విప్పుడు..కత్తులు దూసుడు
NEWS Mar 25,2025 04:51 pm
మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో ఆనాడు వాజ్ పేయి మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తితో ఎదురు చూసే వారన్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతంటే టీవీలకు హత్తుకు పోయే వారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని ఆసక్తి ఉండేదన్నారు. కానీ ఇవాళ శాసన సభలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడు తప్ప ఇంకేమీ లేదంటూ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్స్ వేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేశారు. అక్కడికి వచ్చిన వివేక్ ను నమస్తే మంత్రి అంటూ పలకరించారు.