మడకశిర పట్టణ సీఐగా మంగళవారం నాగేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న రాoగిరి రామయ్య ఆరోపణలపై సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో నాగేష్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ప్రజలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరే కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలు సమాచారం అందించాలని కోరారు.