మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు పెంచబోదన్నారు. మార్చి 31 వరకు మాత్రమే కట్టేందుకు పర్మిషన్ ఇస్తామని, ఆ తర్వాత ఉండదన్నారు. ఆలోగా చెల్లించిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఇప్పుడు కాకుండా ఇళ్ళు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు 100 శాతం కట్టాల్సి ఉంటుందన్నారు. త్వరలో భూమి వాల్యూ పెంచబోతున్నట్లు ప్రకటించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.