NGKL: ఉమ్మడి జిల్లాకు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.