నాగల్ గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాలకు కార్యాలయానికి వచ్చిన ప్రజలకు దాహార్తి తిర్చడానికి వాటర్ ప్యూరిఫై సోమవారం ఎంపీడీవో మహేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల అవసరల సౌకర్యం కోసం మండల ప్రజా పరిషత్ లో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది అందరూ కలిసి వాటర్ ప్యూరిఫై ఏర్పాటు చేశామన్నారు. సహకరించిన సిబ్బందికి ఎంపీడీవో మహేశ్వర రావు అభినందనలు తెలిపారు.