రూ.5,258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్
NEWS Mar 24,2025 06:19 pm
2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని వివరించారు. పోటు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లె, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునః నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. శ్రీవారి అన్నప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాసు బుక్కులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.