రాయికల్ మండలం రామాజీపేటలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు గ్రామస్తులు. వారి వద్ద నుంచి నాటు తుపాకి స్వాధీనం చేసుకున్నారు. బీహార్ వాసులుగా గుర్తించారు. వారిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.