తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి ఫైనల్ లిస్టు విడుదల చేసింది. దీనిపై అభ్యర్థులు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. అశోక్ సార్ టీజీపీఎస్సీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా హైకోర్టులో గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీ వాల్యూయేషన్ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. మూల్యాంకనం పూర్తిగా లోపభూయిష్టంగా జరిగిందంటూ ఆరోపించారు.