నష్ట పోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
NEWS Mar 24,2025 03:46 pm
రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు కొన్నిచోట్ల అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందన్నారు. గత అయిదేళ్లలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఒక్క ఏడాది కూడా ఆదుకోలేదన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అకాల వర్షాలతో నష్టపోయి రోడ్డున పడ్డా పరిహారం అందించకుండా జగన్ రెడ్డి విలాసాల కోసం వేలకోట్లు వృధా చేశారని ఆరోపించారు. తాము పంట నష్ట పోయిన రైతును ఆదుకుంటామని స్పష్టం చేశారు మంత్రి.