గంజాయి సప్లై - పట్టుకున్న పోలీసులు
NEWS Mar 24,2025 02:37 pm
మేడిపల్లి శివారులోని SRSP కాలువ వద్ద గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో మెట్పల్లికి చెందిన గోల్కొండ హరీష్, బొల్లంపల్లి అభిషేక్ నుంచి లక్ష రూపాయల విలువ గల 2 కిలోల 200 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీఎస్పి రాములు తెలిపారు. కోరుట్ల సీఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్, కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు