బెట్టింగ్ యాప్ కేసు విచారణకు శ్యామల
NEWS Mar 24,2025 12:17 pm
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారానికి సంబంధించి యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సోమవారం హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 11 మంది యూట్యూబర్లతో సినీ రంగానికి చెందిన నటీ నటులపై కేసులు నమోదు చేశారు. నటి విష్ణు ప్రియ, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిని 3 గంటలకు పైగా విచారించారు. వారి మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. ఇతర నటులకు నోటీసులు పంపించారు. తాజాగా కేసులో శ్యామలను విచారిస్తున్నారు పోలీసులు.