హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి భారీ ఊరట లభించింది. క్యాట్ లో విచారణ ముగిసేంత వరకు తెలంగాణలో అభిషేక్ మహంతి విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఏపీకి బదిలీ చేస్తూ గతంలో డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభిషేక్ మహంతి క్యాట్ ను, హైకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే మరో వైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహంతి. చాలా మంది అధికారులకు ఏపీకి వెళ్లాలని లేక పోవడం విశేషం.