ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ
NEWS Mar 24,2025 08:20 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించింది. మార్చి 30న హుజూర్ నగర్ మట్టపల్లి లో సీఎం రేవంత్ ప్రారంభిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తారని తెలిపారు. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం ఇస్తూ వచ్చారని, ఇక నుంచి సన్న బియ్యం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించారని పేర్కొన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడం జరిగిందని, 24 లక్షల టన్నుల సన్నబియ్యం సేకరించామన్నారు.