ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి
NEWS Mar 23,2025 09:43 pm
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తక్షణమే నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త ఆదివారం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఖడ్గం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.