MBNR : బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 27 వ తేదీన గురువారం తైబజార్ వేలం వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్ తెలిపారు. ఉదయం 11 గంటలకు తైబజార్ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు మండలంలోని ప్రజలు, వర్తక వ్యాపారస్థులు వేలం పాటలో పాల్గొనాలన్నారు. పూర్తి వివరాలకు గ్రామపంచాయతీలో వివరాలు తెలుసు కోవాలన్నారు.