పెరుగుతున్న ఎండలు అడవిలో ఉన్న జంతువులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అడవిలో నీటి వనరులు అడుగంటిపోయి వన్య ప్రాణులు అనేక అవస్థలు పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెట్పల్లి రేంజ్ పరిధిలోని అడవుల్లో అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేసి సమీప గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా వాటిలో నీటిని నింపి వన్యప్రాణుల దప్పికను తీర్చుతున్నారు. దీంతో జంతువులు గ్రామాల్లోకి రాకుండా ఉంటాయన్నారు.