మెట్ పల్లి పట్టణంలోని ఇందిరమ్మ కాలనిలో చేతి పంపు పని చేయడం లేదని స్థానికులు తెలిపారు. కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నప్పటికీ నీటి సరఫరా జరగడం లేదన్నారు. కాలనీ మొత్తానికి ఒకే బోర్ ఉందని, దానికి కాలనీ మొత్తం ఇండ్లకి పైప్ లైన్ వేసుకోవడంతో ఎవరికి సరిపడా నీళ్ళు రావడం లేదని వివరించారు. అధికారులు స్పందించి కాలనిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.