సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Mar 23,2025 02:12 pm
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ముస్కు గంగావ్వ, మండల అధ్యక్షురాలు మాదాసు సురేఖ, నాయకులు చిన్న రాజన్న, మాదాసు నర్సయ్య, పాకాల రమేష్ గౌడ్, నడిపి రాజన్న, శ్రీను, రాధాకృష్ణ పాల్గొన్నారు.