సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
NEWS Mar 23,2025 08:37 am
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష చేపడతారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై చర్చించనున్నారు. గత రెండు రోజులుగా ఉత్తర తెలంగాణ ను వణికించేలా చేసింది వడగళ్ల వాన.వేలాది ఎకరాల్లో మామిడి, వరి పంటలు నీటి పాలయ్యాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. వర్షాలు, పంట నష్టం గురించి సీఎస్ శాంతి కుమారి సీఎంకు వివరించారు. ఇవాళ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటలు నష్ట పోయిన ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి.