ఏప్రిల్ 5న శ్రీలంకలో మోదీ పర్యటన
NEWS Mar 23,2025 08:33 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రధానమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీన ప్రధానమంత్రి శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇదే సమయంలో సంపూర్ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తారు ఆ దేశ ప్రధానితో కలిసి.