చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్
NEWS Mar 23,2025 07:49 am
ఐపీఎల్ 2025 18వ సీజన్ లో భాగంగా మూడో కీలకమైన మ్యాచ్ కు సిద్దమైంది చెన్నైలోని చిదంబరం స్టేడియం. ఇప్పటికే టికెట్లు అమ్ముడు పోయాయి. హోం గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జోరు మీదుంది. టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ముంబై ఇండియన్స్ తో పోటీ పడనుంది. హై ఓల్టేజ్ నెలకొంది ఈ మ్యాచ్ పై. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్ కతాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇవాళ రెండు కీలక మ్యాచ్ లు జరగనుంది. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనుంది. చెన్నై నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై నుంచి రోహిత్ శర్మల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది మ్యాచ్.